Wednesday, May 16, 2007

41.నాకు తెలీదు

ఒక రోజు నరకలోకంలో యమ ధర్మరాజు కొత్తగా వచ్చిన వందమందిని ఆడాళ్ళను, మగాళ్లను వేరుగా నిలబెట్టాడు. మళ్ళీ అందులో పెళ్ళాం మాటలు వినే మగాళ్ళు ఒక ద్రిక్కు, పెళ్ళాం మాటలు వినకుండా కంట్రోల్ చేసే మగాళ్ళు ఇంకో ద్రిక్కు నిలబడమన్నాడు. ఉన్న ఎనభైమంది మగాళ్ళలో ఢెబ్బైతొమ్మిదిమంది ఒక ప్రక్క, ఒక్కడు మాత్రం మరో ప్రక్కన నిలబడ్డారు. యముడికి చచ్చేంత కోపం వచ్చింది.


వాళ్ళతో ఇలా అన్నాడు. "సిగ్గులేదూ? ఇంతమంది పెళ్ళాం మాటలు వినే దద్దమ్మలు. చీ మగజాతి పరువు తీసేసారు" అన్నాడు.


మిగిలినవాడితో "శభాష్! నువ్వొక్కడివే మొత్తం మగజాతి పరువు నిలబెట్టావు" అని మెచ్చుకున్నాడు. అప్పుడతడు " అదంతా నాకు తెలీదు సామి! నా పెళ్ళాం ఇక్కడ నిలబడమంది. అందుకే నిల్చున్నా" అన్నాడు వినయంగా.


ఇంతలో " యావండి! ఓసారిలా వస్తారూ? " అని యమధర్మరాజుగారి భార్య పిలిచింది. "ఆ.ఆ.. వచ్చే..వచ్చే".. అంటూ వెళ్ళిపోయాడు.

No comments: